8, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేమ కావాలంట...పెళ్లి వద్దంటా.

ప్రేమించానంటే నమ్మింది.. 
పెళ్లి చేసుకుంటానంటే జీవితాన్ని అర్పించడానికి సిద్దపడింది. 
ఏడడుగులు నడిచేరోజు దగ్గర పడుతుంటే సంబరపడిపోయింది. 
బతికినంత వరకు  అండగా ఉంటాడనుకుంది కాని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు.   

కృష్ణ జిల్లా, సిద్ధార్థ నగర్ కు చెందిన బి.మురళి నాయక్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకున్నారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి జనవరి 4 న పెళ్లి నిశ్చయించారు. జనవరి 3 న  మురళి నాయక్ గ్రామం విడచి పరారయ్యాడు. యువతి మనస్తాపాo  చెంది జనవరి 21 న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. ఫిబ్రవరి 7 న నూజివీడు పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు. 

టైంపాస్ కోసం ప్రేమించి  ప్రేమ ముసుగులో  ప్రేమించిన వారిని మోసం చేయకండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి