
పండ్ల చెట్టు నాటితే పండ్లు కాస్తాయి..
ప్రేమ విత్తనం వేస్తే మరణ శిక్ష వస్తుంది.
ప్రపంచంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు చేస్తున్నారు, అన్యాయం అవినీతి రాజ్యమేలుతున్నాయి.. వీటన్నిటిని చూస్తూ అందరూ మౌనం వహిస్తారు.
అది తప్పు అని తెలిసినా కూడా దానిని వ్యతిరేకించరు.
ప్రేమను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు...?
ప్రేమ విషయంలో ఎందుకు ఖఠినంగా ప్రవర్తిస్తారు..?
ప్రేమించడం అంత ఘోరమైన పాపమా...?
కడప జిల్లా, తొండూరు, కదిరి మండలం చలమకుంట గ్రామానికి చెందిన కుటాగళ్ళ రవి.. చక్రాయపేట మండలం, కొండప్ప గారి పల్లెకు చెందిన ఈశ్వర్ రెడ్డి ఇరు కుటుంబీకులు బతుకు తెరువు కోసం బెంగళూర్ వెళ్లారు, వేరు వేరు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు కానీ వీరంతా ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రవి, ఈశ్వర్ రెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు, కుల మతాలు వేరైనా కలసి బ్రతకాలనుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు అందుకు అంగీకరించలేదు.రవి,అమ్మాయి రవి స్వగ్రామo చలమకుంటకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి తనని తీసుకెళ్ళారు. తరువాత అమ్మాయి తండ్రి, మామ కలిసి రవిని పని ఇప్పిస్తామంటూ పిలిపించి మల్లేలఘాట్ కు తీసుకెళ్ళి రవిని రాళ్ళతో కొట్టి చంపేసి శవం కనబడకుండా రాళ్ళతో కప్పిపెట్టారు. ఈ విషయం చాల ఆలస్యంగా వెలుగుచూసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి