
నది ఎప్పుడైనా
సాగరంలో కలవాలి..
అమ్మాయి అబ్బాయి ప్రేమలోనే కలవాలి..
అలాగే ఓ ప్రేమ జంట... ప్రేమతో కలిసి పెళ్లితో ఒక్కటయ్యారు.
కడప జిల్లా, రాజంపేట మండలం పుల్లంపేటకు చెందిన ఫన్నీష్ కుమార్, ఓబులవారి మండలం ముక్కవారిపల్లెకు చెందిన అమ్మాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో విషయం తెలిసిన పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. వీరిరువురు తిరుపతి ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుకొని రాజంపెతలోని మున్నూరు పోలీస్ స్టేషన్ కు చేరి ఇరు కుటుంబాలనుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
వీరు పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమైక జీవితాన్ని చూసి పెద్దలు మెచ్చుకునేల బతకాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి