
మహబూబ్ నగర్ జిల్లా, బీ.కే రెడ్డి కాలనీకి చెందిన మౌనిక, సంపత్ ప్రేమించుకున్నారు. 23 తేదిన పెళ్ళిచేసుకున్నారు. గురువారం మౌనిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన ప్రేమికులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, మాకు రక్షణ కలిపించాల్సిందిగా కోరారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంటలకు ఏ సమస్యలు రాకూడదని కోరుకుంటూ, జీవితాంతం ప్రేమకు నిదర్శనంగా.. ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి