ఇప్పుడు మీ కోపం చల్లారిందా?
మీ పంతాలు నేగ్గాయా ?
మీ పట్టింపులు తీరాయా?
అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు
రైలు పట్టాలపై ముక్కలైనా మీ తప్పు తెలిసిరాలేదా?
బిడ్డలకు అడిగిందల్లా ఇచ్చే మీరు
ప్రేమను ఎందుకు కాదంటున్నారు?
పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని మీరు
వారిని చావుకు ఎందుకు పురికొల్పుతున్నారు?
తునాతునకలైన ప్రేమికుల మృత దేహాలు
అడుగుతున్నాయి సమాధానం చెప్పండి...
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగకు చెందినా మోహన్ కృష్ణ , సత్యవేడుకు చెందిన చాతుర్య ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు కాదన్నారు. బతికితే కలిసి బతుకుదాం... లేకపోతే కలిసి చనిపోదాo అని నిర్ణ యించుకున్నారు. నెల్లూరు జిల్లా సూల్లురుపేట సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.
ప్రేమికుల్లారా చావాల్సింది మీరు కాదు... పెద్దల్లోని ద్వేషం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి