ప్రేమ తీసిన ప్రాణం
కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్ చెందిన
చక్రధర్ ఒక యువతిని ప్రేమించాడు.
యువతిని తీసుకొనివెళ్ళిపోయాడు.
వారిబంధువులు ఇద్దరిని
పట్టుకొచ్చి హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత చక్రధర్ తండ్రి చనిపోవడంతో సింగరేణి గనిలో ఉద్యోగం ఇచ్చారు. అక్కడ విధులకు వెళ్ళిన చక్రధర్ హత్యకు గురయ్యాడు. యువతి బంధువులే ఈ పని చేసి ఉంటారని చక్రధర్ తల్లి కేసు పెట్టారు. చక్రధర్ కు నలుగురు పెళ్ళికాని చెల్లెళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటని తల్లి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.
వన్ సైడ్ లవ్
బెంగళూర్ కు చెందిన ఐటి ఉద్యోగిని పవిత్ర అనే యువతి అక్కడ నటుడు శ్రీ మురళిని ప్రేమించింది. మురళి ఫోన్ నంబర్ తెలుసుకుని రోజు సందేశం పంపేది. మురళి వాటికి స్పందించేవాడు కాదు. వన్ సైడ్ లవ్ చేసేది. మురళికి ఇదేవరకే పెళ్లి అయింది. బుధవారం మురళి ఇంటి వద్దకు వెళ్ళిన పవిత్ర తనను పెళ్ళిచేసుకోవాలని, లేక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వెంటనే మురళి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను తీసుకెళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మనస్తాపం చెందిన పవిత్ర నిద్ర మాత్రలు మింగి మురళి ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి