30, డిసెంబర్ 2013, సోమవారం

ప్రేమ కోసం పరుగులు తీసిన ప్రేమికులు

ప్రేమించి పెద్దలు ఒప్పుకోలేదని వారిని ఎదిరించే ధైర్యం లేక, పెద్దలను ఒప్పించలేక, మనసును చంపుకొని ప్రేమలో ఓడిపోయి నిర్జీవంగా బతుకును సాగిస్తూ ఉంటారు కొందరు. 

ఒక ప్రేమ జంట మాత్రం అలా చేయలేదు. ప్రేమను జయించింది.. మనసును బతికించింది. ఎంతమంది వారి ప్రేమను ఓడించాలని ప్రయత్నించినా చివరికి ప్రేమే గెలిచింది. 

శ్రీకాకుళం పట్టణంలోని గూనేపాలెం మేదరవీదికి చెందిన ఎల్.నీలిమ,  టి.సంతోష్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతో 6నెలల క్రితం వీరిద్దరూ విజయవాడకు వెళ్లిపోయారు. నీలిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని వెతికి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నీలిమ అంతటితో ఆగిపోకుండా ఆత్మహత్యాయత్ననికి ప్రయత్నించింది. నీలిమ కోలుకున్న తరువాత డిసెంబర్ 27 న శుక్రవారం తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం వెళ్ళిపోయింది. నీలిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నీలిమ సంతోష్ లు అదే రోజు విశాఖలో వినాయక ఆలయంలో పెళ్ళిచేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు కాని వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. మళ్లీ వారిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. పోలీసులు వారిని వెతికిపట్టుకొని మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరి ఇరువురి పెద్దలమద్య వాగ్వాదం జరిగింది. అయినా కూడా వీరు భయపడక మేము మేజర్లము మాకు ఇదివరకే పెళ్ళైపోయింది, ఇందులో ఎవరి బలవంతం లేదని ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని ధైర్యంగా చెప్పి అందరి సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్నారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి