29, డిసెంబర్ 2013, ఆదివారం

ప్రేమ ఫలించింది

వికసించని పుష్పం పరిమళమివ్వదు 
మాగని ఫలం రుచిని ఇవ్వదు 
పరిపక్వం సాధించని ప్రేమ అంతే మన్ననలు పొందదు. 

ప్రేమించి తొందర పడకుండా మైనారిటీ తీరేవరకు ఆగి, ఎవరి వలన ఇబ్బందులు కలుగకుండా ఆలోచించి ముందడుగు వేసి పెళ్లి చేసుకున్నారు. యువత ఈ విషయాన్ని గ్రహించాలి. 

రామచంద్రపురంపట్టణానికి చెందిన జక్కా దుర్గా ప్రసాద్ , మండపేటకు చెందిన గుత్తుల శ్రీదేవి గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు తల్లిదండ్రులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు. అయితే వీరు మైనారిటీ తీరేవరకు ఆగి, మైనారిటి తీరగానే శనివారం ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. శనివారం సాయంత్రం రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు. 

వీరి ప్రేమైక జీవితం ఆనందంగా గడవాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి