21, డిసెంబర్ 2013, శనివారం

ప్రేమించినందుకు మరణ శిక్ష.

ప్రేమే ప్రాణం అనుకుంది.. 
ప్రియుడే జీవితం అనుకుంది.. 
ఆ ప్రేమే ప్రాణం తీసింది..  
ఆ ప్రియుడే ప్రాణం తీశాడు.

తన హృదయాన్ని పువ్వుగా చేసి ప్రియుడికి అర్పిస్తే,
ప్రియుడి తన గుండెను బండరాయి చేసుకొని ఆ రాయితో ఆమె గుండెపై కొట్టి చంపేశాడు. 

రామ చంద్రాపురం ఎస్ ఎస్ కాలనీకి చెందిన రేష్మా , దుర్గాప్రసాద్ లు ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోమని ప్రియుడిని అడిగింది రేష్మా. కొద్దిరోజులు ఆగుదమన్నాడు దుర్గాప్రసాద్. ఇద్దరిమద్య మాటామాట పెరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రేష్మా బెదిరించడంతో ఆగ్రహించిన ప్రియుడు రాయితో ఆమె తలపై మోదాడు. తర్వాత నేలకు గట్టిగా కొట్టాడు. దీంతో రేష్మా అక్కడికక్కడే మృతి చెందింది. 

అమ్మాయిలు ఇటువంటి దుర్మార్గులతో జాగ్రత్త. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి