6, డిసెంబర్ 2013, శుక్రవారం

నెల్సన్ మండేలా ప్రేమ కథ


నల్ల జాతీయుల సూరీడు నెల్సన్ మండేలా ఒక భారత సంతతి మహిళను ప్రేమించారు. ఆమె ఆయన ప్రేమను అంగీకరించి ఉంటె సౌత్ ఆఫ్రికాకు ఆమె ప్రథమ పౌరురాలు అయ్యేవారు. 

 అమైనా కాచిలియా అనే భారత సంతతి మహిళ సౌత్ ఆఫ్రికాలో ఒక సామాజిక కార్యకర్త. 28 ఏళ్ల జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత మండేలా ( తొలి బార్యతో విడివడిన తర్వాత) తనను ప్రేమిస్తున్నట్లు చెప్పినట్లు ఆమినా తన ఆటోబయోగ్రఫీ *వెన్ హోప్ అండ్ హిస్టరీ రైమ్* అనే పుస్తకంలో రాశారు. 

ఒక రోజు తన ఇంటికి వచ్చిన మండేలా తనను గాడంగా ముద్దాడారని, తనను చాలా అందగత్తవని పొగిడారని రాశారు. ఆయనను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. *నేను వృద్ధురాలిని అంటే ..గతం గతః ఇప్పుడు కొత్త జీవితం ప్రారంబిద్దామని మండేలా చెప్పినట్లు పేర్కోన్నారు . అప్పుడు మండేలా ప్రేమను తాను తిరస్కరించినట్లు పుస్తకంలో రాశారు . ఆ తరవాత మండేలా ఎంతో స్నేహంగా ఉండేవారిని తెలిపారు.

 అలా మండేలా ప్రేమ వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలి పోయింది. 


గాంధీ బాటలో నడిచి నల్ల జాతీయుల స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు ఈ ప్రపంచాన్ని వదిలివేసి వెళ్ళిపోయారు . ఆయనకు ఘనంగా ప్రేమ హృదయం నివాళి అర్పిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి